కర్ణాటక,కోలారు: తమ్మునికి కరోనా సోకగా, ఆ భయంతో అన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోలారు నగరంలోని గాంధీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన నాగరాజ్ (37) అనే తాపీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. శనివారం మధ్యాహ్నం తమ్మునికి కరోనా పాజిటివ్గా రావడంతో ఆరోగ్య శాఖ అధికారులు అతనిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో తనకు కూడా కరోనా సోకి ఉంటుందేమోననే అన్న నాగరాజ్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.