ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

21 Jan, 2018 20:02 IST|Sakshi

సాక్షి, ధర్మవరం: చెరువులో ఈతకు వెళ్లి ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. పీఆర్‌టీ వీధికి చెందిన విజయ్(25) స్థానిక చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈతగాళ్ల సాయంతో ఇతని కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు