వాషింగ్టన్లో క్యాట్స్ నేతృత్వంలో పేదలకు భోజనాలు

26 Aug, 2013 19:05 IST|Sakshi
వాషింగ్టన్లో క్యాట్స్ నేతృత్వంలో పేదలకు భోజనాలు

అమెరికా రాజధాని  ప్రాంత తెలుగు సంఘం (క్యాట్స్) నేతృత్వంలో సంఘసేవా కార్యక్రమంలో భాగంగా వాషింగ్టన్ డీసీలో ఉన్న ఐదువేల మంది పేదవారికి భోజనాలు వండిపెట్టారు. క్యాట్స్ సంస్థ వాషింగ్టన్ పరిసర ప్రాంతాల్లో తెలుగు సంస్కృతిని ప్రోత్సహిస్తూ ,  సంఘసేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంది.
 
గత  తొమ్మిదేళ్లుగా తెలుగు పాఠశాల నిర్వహణ, తెలుగు పండుగల వేడుకలు, వేసవిలో "తెలుగు పిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇంకా, తాము నివసిస్తున్న వాషింగ్టన్ పరిసర ప్రాంతాలలో, పేదవారికి సేవ చేయాలని ఉద్దేశంతో , ప్రతి ఏటా "వాషింగ్టన్ డిసి కిచెన్లో" నిర్వహించే "ఫుడ్ ఫర్ నీడీ" కార్యక్రమంలో అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొని పేదవారి కోసం స్వయంగా వండి వడ్డిస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఐదువేల మంది పేదలకు భోజనాలు వండి వడ్డించి పెట్టారు.

మరిన్ని వార్తలు