మోడీకి శుభాకాంక్షలు తెలిపిన ఓఎఫ్బీజేపీ

14 Sep, 2013 12:53 IST|Sakshi

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని భారత ప్రధాని మంత్రి పదవికి అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఎంపిక చేయడాన్ని యూఎస్లోని ఆ పార్టీ అనుబంధ సంస్థ  ద ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (ఓఎఫ్బీజేపీ) హార్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మోడీకి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓఎఫ్బీజేపీ శనివారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.   

 

న్యూఢిల్లీలో నిన్న జరిగిన బీజేపీ కార్యవర్గం సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గుజరాత్ సీఎం నరేంద్రమోడీ పేరును ప్రకటించగానే తమకు ఆనందానికి అవధులు లేవని ఆ ప్రకటనలో వెల్లడించింది.  ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎంపిక చేసినందుకు రాజ్నాథ్కు ఓఎఫ్బీజేపీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఈ నెల 20 నుంచి 21 వరకు ఫ్లారెడాలోని తంపాలో జరిగే ఓఎఫ్బీజేపీ వార్షిక సదస్సులో ఆహ్వానితులను ఉద్దేశించి మోడీ వీడియో కాన్ఫరేన్స్ ద్వారా ప్రసంగిస్తారని ఓఎఫ్బీజేపీ వివరించింది.

>
మరిన్ని వార్తలు