ఐటీఎస్‌ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

8 Apr, 2017 08:34 IST|Sakshi
ఐటీఎస్‌ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా డబ్లిన్‌లో ఐటీఎస్‌ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం జరగబోతుంది. ఇది ఏప్రిల్‌ 9న మాల్ట్రాన్‌ హోటల్‌, వైట్స్‌టౌన్‌ వే, తాలా, డబ్లిన్‌లో మద్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి వందలాది మంది ఎన్నారైలు హాజరుకానున్నారు. ఇందులో తెలుగు సంస్కృతిని అద్దం పట్టే కార్యక్రమాలను ఐటీఎస్‌ రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగర్స్‌ గోపిక, మల్లిఖార్జున, జబర్దస్త్‌ ఫేం అదిరే అభి, మాస్‌ అవినాశ్‌లు పాల్గొననున్నారు. ఇందులో పల్గోనాలనుకునే వారు ముందుగా www.lrelandtelugusamajam.org లో రిజిస్టర్‌ చేసుకొని ఉచితంగా ఎంట్రీ టికెట్‌ పొందవచ్చు.

మరిన్ని వార్తలు