విశాఖలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

20 Jul, 2015 11:46 IST|Sakshi
విశాఖలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

- ఐదుగురి పరిస్థితి విషమం
మధురవాడ(విశాఖపట్టణం): విశాఖపట్నం లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి ఆర్టీసీ బస్సు విశాఖ వైపు వెళ్తోంది. అదే సమయంలో మారికవలస వద్ద సర్వీసు రోడ్డులోంచి ఓ స్కార్పియో ఒక్కసారిగా హైవేపైకి వచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నట్టుండి బస్సును కుడిచేతి వైపు తీసుకెళ్లాడు. దీంతో అటువైపున్న ఆటోను బస్సు ఢీకొట్టింది.

ఆ క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పాన్ షాప్ పై నుంచి దూసుకెళ్లి పది మీటర్ల ముందుగా వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో, పాన్ షాప్ వద్ద ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో ఆరుగురు మృతిచెందగా,  క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు