అర్ధవీడు మండలం మొహిద్దీన్పురంలో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. పిచ్చి పట్టిన విధంగా ఆవు కనపడిన జనాలపైకి దూసుకురావడంతో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా..మరో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.