వైఎస్సార్‌సీపీలో చేరిన 100 కుటుంబాలు

17 Jun, 2016 13:14 IST|Sakshi

జమ్మలమడుగు : వైఎస్సార్ జిల్లా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో 100 కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరాయి. జమ్మలమడుగులో స్థానిక కౌన్సిలర్ మార్తమ్మ, ఆమె భర్త మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి సంగరయ్యలు కూడా వైఎస్సార్‌సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరంతా నిన్నటి వరకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గంలో ఉన్నారు. అవినాష్ రెడ్డితో పాటు జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు