త్వరలో 1000 కొత్త ఆర్‌టీసీ బస్సులు

3 Aug, 2017 21:53 IST|Sakshi

కదిరి: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 1000 కొత్త ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) జయరావ్‌ తెలిపారు. రెండు నెలల్లో అన్ని డిపోలకు అవసరమైనన్ని కొత్త బస్సులు పంపుతామని చెప్పారు. గురువారం ఆయన కదిరి ఆర్‌టీసీ డిపోను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. అనంతరం ఆర్‌ఎం చిట్టిబాబుతో కలిసి డీఎం సూర్యనారాయణ చాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కర్ణాటకతో కుదుర్చున్న ఒప్పందం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రధాన నగరాలు, పట్టణాల నుండి బెంగళూరుకు బస్సులు నడుపుతామన్నారు. గత ఏడాదితో పోలిస్తే 65 శాతం దాకా నష్టాన్ని అధిగమించామని చెప్పారు. కొన్ని డిపోల్లో పల్లె వెలుగు బస్సుల ద్వారా నెలకు ఒక్కో బస్సు ద్వారా రూ1.50 లక్షలు దాకా నష్టం వస్తోందన్నారు. అలాంటి మార్గాల్లోని గ్రామాలను సందర్శించి ఎందుకు ఆర్టీసీ బస్సు ఎక్కడం లేదో తెలుసుకొని చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు