10 నుంచి ఐద్వా ఆల్‌ ఇండియా మహాసభలు

25 Nov, 2016 23:17 IST|Sakshi

గుత్తి:

మధ్యప్రదేశ్‌ రాజధాని బోపాల్‌లో డిసెంబర్‌10 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న ఐద్వా ఆల్‌ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు సునీత, రేణుక, శ్రీదేవి, నిర్మల  పిలుపునిచ్చారు. పట్టణంలోని జడ్‌ వీరారెడ్డి కాలనీలో శనివారం ఐద్వా జెండాను ఆవిష్కరించారు.  మహసభలకు సంబంధించిన జీపు జాతా డిసెంబర్‌ 5న గుత్తికి వస్తోందన్నారు.

 

మరిన్ని వార్తలు