ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్య

23 Jan, 2016 08:15 IST|Sakshi
ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్య

కంచికచర్ల: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంచికచెర్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వినయ్ కుమార్ అనే విద్యార్థి స్కూల్లోనే ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చదువు ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు