11 ఎర్రచందనం దుంగల స్వాధీనం

23 Dec, 2016 23:13 IST|Sakshi

రైల్వేకోడూరు రూరల్‌: మండలంలోని బాలుపల్లె ఫారెస్ట్‌ పరిధిలో వెలుగుదొనకొండ బీట్‌లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఓ వెంకట సుబ్బయ్య, టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ లక్ష్మయ్య  శుక్రవారం తెలిపారు. కూంబింగ్‌లో భాగంగా చేపట్టిన తనిఖీలలో దుంగలతోపాటు గొడ్డళ్లు, వంట పాత్రలు, రంపాలను స్వాధీనం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.

 

మరిన్ని వార్తలు