12 మందికి పిచ్చికుక్క కాటు

29 Aug, 2017 22:48 IST|Sakshi

ధర్మవరం అర్బన్: మల్కాపురం గ్రామానికి చెందిన 12 మందిని మంగళవారం పిచ్చికుక్క కరిచింది. తెల్లవారుజామున ఇళ్ల వద్ద నిద్రిస్తున్న వారిపై ఒక్కసారిగా దాడి చేసింది. కుక్కకాటుకు గురైన వారిని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. పిచ్చికుక్కను గ్రామం నుంచి తరిమేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు