తుంగభద్ర జలాశయంలో 14.03 టీఎంసీల నీరు

13 Jul, 2017 22:42 IST|Sakshi

బొమ్మనహాళ్‌ : తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గురువారం నాటికి జలాశయంలో 14.03 టీఎంసీల నీరు చేరిందని అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాకు తాగు , సాగు నీరు అవసరాలు తీరుస్తున్న తుంగభద్రకు ఈసారి అనుకున్నంతగా నీరు చేరలేదు. జలాశయంలో గత సంవత్సరం ఇదే సమయానికి 30.856 టీఎంసీలు నిల్వ ఉండగా... ప్రస్తుతం 14.034 టీంసీల నీరు మాత్రమే ఉండని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు