డిగ్రీ పరీక్షల్లో 14 మంది డీబార్‌

31 Dec, 1998 00:00 IST|Sakshi

ఎస్కేయూ : డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో శనివారం 14 మంది విద్యార్థులు డీబార్‌ అయినట్లు ఎస్కేయూ ఎవాల్యుయేషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌  రామ్మూర్తి తెలిపారు. గుత్తిలోని శ్రీసాయి డిగ్రీ కళాశాలలో ఐదుగురు, ఎంఎస్‌ డిగ్రీ కళాశాల ఆరుగురు, ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు, మహాత్మాగాంధీ డిగ్రీ కళాశాలలో మరో విద్యార్థి, గుంతకల్లులోని శంకరానంద డిగ్రీ కళాశాల ఒక విద్యార్థి  కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడినట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు