కర్నూలు(అగ్రికల్చర్): ఉర్దూ యూనివర్సిటీకి ఓర్వకల్లోని మార్కెట్ విలువపై భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓర్వకల్లోని 531–1, 556ఏ సర్వే నంబర్లలో 144 ఎకరాల భూములను కేటాయించింది. ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేటాయించిన భూములను ఉన్నత విద్యాశాఖకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.