పార్వతీపురం : జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడి గ్రామంలో గత మంగళవారం జరిపిన ఎక్సైజ్దాడుల్లో పట్టుబడిన 2,026 కిలోల నల్లబెల్లం కేసుకు సంబంధించి 15 మందిని శనివారం అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ ఎస్. విజయ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాడుల్లో 2026 కిలోల నల్లబెల్లం, 100 కిలోల అమ్మోనియా, 40 లీటర్ల నాటుసారా, రెండు ఖాళీ అల్యూమినియం వెసిల్స్, రెండు ఖాళీ అల్యూమినియం పాట్స్, తూనికల మిషన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే ఒక మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేశామని చెప్పారు. నిందితులుగా భావించిన రాయిపల్లిరాజు, మండంగి గౌరీశంకరరావు, రాయిపల్లి రమేష్, గంటా మోహన్, రాయిపల్లి ఉమా మహేశ్వరరావు, పరిటి పోలినాయుడు, మెరుపల తిరుపతినాయుడు, పాలవలస ఉమ, బోమ్మాళి యోగీసు, నాగల్ల అప్పలస్వామి, బొమ్మాళి ప్రకాష్, గరుగుబిల్లి తాతబాబు, గరుగుబిల్లి శ్రీరాము, డొనక కన్నయ్య, చింతాడ కుమార్, తదితరులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై జె. రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.