15మంది మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

23 Dec, 2015 22:05 IST|Sakshi

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో బుధవారం పర్లోవపేటకు చెందిన 15 మంది మత్స్యకారుల ఆచూకీ గల్లంతైంది. 15 రోజుల కిందట రెండు బోట్లలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇంకా తిరిగిరాలేదు.

దాంతో నాలుగు రోజుల కిందట బాధిత కుటుంబాలు తమ వాళ్లు చేపల వేటకని వెళ్లి ఇంతవరకూ తిరిగిరాలేదంటూ కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు. ఆయన అధికారులు స్పందించకపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు