19న భూమిపూజ

4 Aug, 2016 21:24 IST|Sakshi

హిందూపురం అర్బన్‌ : స్థానిక ఎంజీఎం మైదానంలోని ఇండోర్‌ స్టేడియంలో అభివృద్ధి పనులకు ఈనెల 19వlతేదీ ఎమ్మెల్యే బాలకృష్ణ భూమిపూజ చేస్తారని ఆయన పీఏ బాలాజీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కార్మిక, క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడును కలిసి స్టేడియం అభివృద్ధి పనులు, నిధులు మంజూరుపై ఎమ్మెల్యే చర్చించారని ఆయన తెలిపారు. రూ.17 కోట్లతో స్టేడియంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టడానికి మంత్రి ఆమోదించారని తొలివిడతగా రూ.6 కోట్లు మంజూరు చేశారని వివరించారు.

మరిన్ని వార్తలు