జాబ్‌మేళాలో 20 మంది ఎంపిక

3 Nov, 2016 23:40 IST|Sakshi
జాబ్‌మేళాలో 20 మంది ఎంపిక

కడప కోటిరెడ్డి సర్కిల్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు జనరేషన్‌ మిషన్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాబ్‌మేళాలో 20 మంది ఎంపికయ్యారని డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  మెడ్‌ప్లస్‌ కంపెనీలో కస్టమర్‌ సేల్‌ అసోసియేట్, ఫార్మసిస్టు తదితర ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. ఈ ఎంపికలకు 50 మంది హాజరు కాగా వారిలో ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎంపిక చేశారని వివరించారు. ఎంపికైన వారు ఈనెల 8న బెంగుళూరులోని మెడ్‌ప్లస్‌ కంపెనీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతిని«ధులు, డీఆర్‌డీఏ సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు