20 మంది డిగ్రీ విద్యార్థులు డీబార్‌

24 Mar, 2017 23:10 IST|Sakshi

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో 20 మంది విద్యార్థులను డీబార్‌ చేసినట్లు ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌ ఆచార్య రెడ్డివెంకటరాజు, జాయింట్‌ డైరెక్టర్‌ ఆచార్య రామ్మూర్తి తెలిపారు. గుత్తిలోని ఎంఎస్‌ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 12 మంది, శ్రీసాయి డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ముగ్గురు,  తాడిపత్రిలోని సీవీ రామన్‌ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఐదుగురు విద్యార్థులు డీబార్‌ అయినట్లు వివరించారు. వీరిలో 19 మంది మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడగా, సీవీరామన్‌ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రలో ఒక విద్యార్థికి బదులు మరో విద్యార్థి పరీక్ష రాస్తూ పట్టుబడటంతో డీబార్‌ చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు