అవమానం తట్టుకోలేక..

30 Mar, 2017 20:38 IST|Sakshi

వైఎస్ఆర్ జిల్లా(వల్లూరు):
అవమానం తట్టుకోలేక మండలంలోని ఆదినిమ్మాయపల్లెకు చెందిన అవివాహిత యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 24 వ తేదీన ఆదినిమ్మాయపల్లెకు చెందిన సుప్రజ (20 ) అనే అవివాహిత యువతి తమ ఇంటిలో ఉండగా తల్లిదండ్రులు ఎవరూలేని సమయంలో మిట్టపల్లెకు చెందిన పాశం భాస్కర్‌ బాబు అనే యుకుడు ఇంటిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారు పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అయితే అప్పటి నుంచి అవమాన భారంతో కుమిలిపోతున్న యువతి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. యువతి మృతికి కారణమైన నిందితుని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు