22 మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు పదోన్నతి

23 Sep, 2016 00:02 IST|Sakshi
కరీంనగర్‌ క్రై ం: జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పని చేస్తున్న 22 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎసై ్సలుగా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్‌ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో 1984 బ్యాచ్‌కు చెందిన వారే అధికంగా ఉన్నారు. త్వరలోనే వీరికి బదిలీలు జరిగే అవకాశముంది. చాలా కాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేశారు. ఎస్పీ జోయల్‌డేవిస్‌కు కతజ్ఞతలు తెలిపారు. 
 
 
మరిన్ని వార్తలు