ఖైదీ మృతిపై 22న విచారణ

9 Sep, 2016 23:15 IST|Sakshi
హన్మకొండ చౌరస్తా : వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ జూలై 23న మరణించిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ మం డలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన జీవిత ఖైదీ (నెంబర్‌ 2603) ఇట్టబోయిన వెంకటయ్య మృతిపై ఈ నెల 22న మెజి స్టీరియల్‌ విచారణ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్డీఓ వెంకటమాధవరావు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. హన్మకొండలోని ఆర్డీఓ కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు జరిగే విచారణ లో సంబంధిత వ్యక్తులు తగిన సాక్ష్యాధారాలతో వాంగ్మూలం ఇవ్వవచ్చన్నారు. 
 
మరిన్ని వార్తలు