విద్యుత్‌ తీగలు తగిలి 23 గొర్రెలు మృతి

25 Dec, 2016 23:25 IST|Sakshi

ధర్మవరం రూరల్‌ : మండలంలోని బలిజమడి తండా సమీపంలో ఆదివారం విద్యుత్‌ తీగలు తెగిపడి 23 గొర్రెలు మృతి చెందాయని బాధితులు కేశవయ్య, మ«ధునాయక్, సోమ్లానాయక్‌ తెలిపారు. మేత కోసం గ్రామ సమీపంలోని దొడ్డిలోకి గొర్రెలు తోలగా, ఉదయం 8 గంటలకు ఒక్కసారిగా విద్యుత్‌ స్తంభానికున్న తీగలు తెగి గొర్రెల మందపై పడ్డాయన్నారు. దీంతో మందలోని గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు