రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 24.458 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్ తెలిపారు. లోలెవల్ స్లూయీస్కు 37 క్యూసెక్కులు, మొదటి బ్రాంచ్ కెనాల్కు 20 క్యూసెక్కులు, పికప్ ఏరుకు 30 క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.