246 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ

19 Jul, 2017 22:32 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : విత్తన పంపిణీలో భాగంగా 47వ రోజు బుధవారం 220 మంది రైతులకు 246 క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. ఇప్పటివరకూ 2,87,110 మంది రైతులకు 3,30,665 క్వింటాళ్ల విత్తనాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు. 20,328 మంది రైతులకు 2,340 క్వింటాళ్ల కందులు, 45,858 మంది రైతులకు 93,129 బహుధాన్యపు కిట్లు, 3,709 మంది రైతులకు 624 క్వింటాళ్ల మొక్కజొన్న పంపిణీ చేసినట్లు వివరించారు. ఇందులో ఎంవీకేల ద్వారా 51,712 క్వింటాళ్ల వేరుశనగ, 60,625 బహుధాన్యపు కిట్లు ఇచ్చినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు