మూడు తాటాకిళ్లు దగ్ధం

14 Apr, 2017 00:31 IST|Sakshi
మూడు తాటాకిళ్లు దగ్ధం
భీమలాపురం (ఆచంట) :  గ్రామంలో గురువారం గుడాల నాగమణి, గుడాల సుబ్బారావు, గుడాల చిన సత్యనారాయణకు చెందిన మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ.ఆరు లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు బాధితులు చెప్పారు. నాగమణి ఇంట్లో సంభవించిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు తెలిపారు. నాగమణి కొద్ది కాలం క్రితం తన ఇంటిని కొబ్బరి కాయల వ్యాపారి సత్యనారాయణకు అద్దెకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఆయనకు చెందిన సుమారు రెండు లక్షల విలువైన కొబ్బరి కాయలు దగ్ధమయ్యాయి. పాలకొల్లు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధితులను సర్పంచ్‌ చింతపర్తి సత్యనారాయణ, ఆర్‌ఐ సన్నిబాబు, వీఆర్‌వో నరసింహరావు పరామర్శించారు. 
 
 
 
మరిన్ని వార్తలు