కార్డన్ సెర్చ్లో ముగ్గురు రౌడీ షీటర్ల అరెస్ట్

12 Dec, 2016 14:25 IST|Sakshi

రాజమహేంద్రవరం: నగరంలో సమస్యాత్మకమైన రాజేంద్రనగర్లో పోలీసులు ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 56 బైక్‌లను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రౌడీ షీటర్లను, ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ ఎస్పీ డి.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో 300 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు