పాడేరులో 30 కిలోల గంజాయి స్వాధీనం

15 Jul, 2016 14:00 IST|Sakshi
పాడేరు : విశాఖపట్నం జిల్లా పాడేరులో 30 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆర్టీసీ బస్సులో అక్రమంగా రవాణా చేస్తుండగా కండక్టర్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు