34మంది ఎస్సైలకు పదోన్నతి

31 Jul, 2016 22:02 IST|Sakshi
 ఏలూరు (మెట్రో):  ఏలూరు రేంజ్‌ పరిధిలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని 34 మంది 2007 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు కల్పిస్తూ రేంజ్‌ yీ ఐజీ పీవీఎస్‌ రామకృష్ణ ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో 28 మందికి మాత్రమే సోమవారం పదోన్నతులను అందించనున్నారు. ఆరుగురు ఎస్సైలు వివిధ ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ విచారణ పూర్తయిన తరువాత వీరికి సీఐలుగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు జాబితా సోమవారం ప్రకటించనున్నారు.  
14 మంది ఏఎస్సైలకు..
రేంజ్‌ పరిధిలోని 14 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతులు కల్పిస్తూ డీఐజీ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. వీరి జాబితానూ సోమవారం ప్రకటించనున్నారు. 
 
మరిన్ని వార్తలు