రిటైర్మెంట్ వేడుకలో అపశృతి..

29 Jul, 2016 18:43 IST|Sakshi

- 35 మందికి అస్వస్థత
సారంగపూర్(ఆదిలాబాద్ జిల్లా)

 ఓ రిటైర్మెంట్ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. విషాహారం తిని 35 మంది అస్వస్థతకు గురయ్యారు.వివరాలు.. సారంగపూర్ మండలం చించోలి హైస్కూల్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న నరసయ్య ఈరోజు( శుక్రవారం) రిటైర్ కాబోతున్నాడు. ఈ సందర్భంగా చిన్న వేడుక ఏర్పాటు చేశాడు. వేడుకలో తిన్న వంటకాలు విషపూరితం అయ్యి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన విద్యార్థులను చికిత్స నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

మరిన్ని వార్తలు