38 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

10 Nov, 2016 02:27 IST|Sakshi
జంగారెడ్డిగూడెం : స్థానిక బుట్టాయగూడెం రోడ్డులోని ఒక షాపులో అక్రమంగా నిల్వచేసిన 38 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ఎస్‌ఐ ఎం.కేశవరావు తమ సిబ్బందితో దాడిచేసి బుధవారం పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. సివిల్‌ సప్లయిస్‌ డీటీ డి.వి.సత్యనారాయణ, వీఆర్‌వోలు రవి, గఫూర్‌ , ఎస్‌కే వలి, కె.రవి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు డీటీ సత్యనారాయణ వెల్లడించారు.
 

 

మరిన్ని వార్తలు