కుంటలో పడి నలుగురు చిన్నారుల మృతి

12 Aug, 2016 15:24 IST|Sakshi
గుంటూరు క్రైం: గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన నగర శివారులోని ఓబులనాయుడుపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఈత కొట్టడానికి కుంటవద్దకు వెళ్లారు. కుంట లోతు ఎక్కువగా ఉండటంతో.. ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతి చెందారు. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహాలను బయటకు వెలికితీసి పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతిలో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి
>
మరిన్ని వార్తలు