40పశువుల పట్టివేత

3 Sep, 2016 23:07 IST|Sakshi

  చౌటుప్పల్‌:
కబేళాకు తరలిస్తున్న 40పశువులను చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద శనివారం పోలీసులు పట్టుకున్నారు. రెండు డీసీఎంలలో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌లోని బహదూర్‌పుర కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. వీటిలో గేదెలు, ఆవులు ఉన్నాయి. వీటిని గోశాలకు తరలించారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు