4009 పోస్టులకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్

24 Aug, 2016 11:11 IST|Sakshi

విశాఖపట్నం : ఏపీపీఎస్సీ నుంచి 4009 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో ఉదయ్ భాస్కర్ విలేకర్లతో మాట్లాడుతూ... ప్రతి ఏడాది పరీక్షల ఇయర్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్లైన్ పద్దతిలో నిర్వహిస్తామని తెలిపారు. గతంలో కోర్టు కేసులను పరిగణలోకి తీసుకోని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉదయ్భాస్కర్ వివరించారు.

మరిన్ని వార్తలు