48 కిలోల గంజాయి స్వాధీనం

18 Oct, 2016 17:24 IST|Sakshi

రోలుగుంట (విశాఖపట్టణం జిల్లా) : చోడవరం మండలం భోగాపురం వద్ద మంగళవారం సాయంత్రం 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు భోగాపురం శివారులో కాపుకాసిన పోలీసులు గంజాయి తీసుకెళుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 48 కిలోల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు