ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు

3 Oct, 2016 17:26 IST|Sakshi

కొమరోలు (ప్రకాశం) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లీనగరం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అల్లీనగరం శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు