రేషన్ బియ్యం పట్టివేత : ఇద్దరు అరెస్ట్

10 Jun, 2016 11:28 IST|Sakshi

విజయవాడ : కృష్ణాజిల్లా వీర్లపాడు మండలం పెద్దాపురంలో అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరా శాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే బియ్యాన్ని తరలిస్తున్న లారీతోపాటు ఆటోను పోలీసులు సీజ్ చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు