కేసీకి 500క్యూసెక్కుల నీరు విడుదల

24 Jan, 2017 22:06 IST|Sakshi
కేసీకి 500క్యూసెక్కుల నీరు విడుదల
జూపాడుబంగ్లా: కర్నూలు–కడప కాల్వకు 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ నరేష్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగు చేసిన పంటలకు మరో తడి నీరు అందితేనే పండుతాయని రైతుల విజ్ఞప్తి మేరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రెండు పంపుల ద్వారా  ఈ నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.  కృష్ణాబోర్డు  కేసీకి 3 టీఎంసీల నీటి విడుదలకు అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ నీరు వచ్చే వరకు   తొందరపడి వరినాట్లు వేసుకోవద్దని  మెట్టపంటలను మాత్రమే సాగు చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. 
 
 
మరిన్ని వార్తలు