‘ఉత్తమ’ ఉద్యోగులు 56 మంది

14 Aug, 2016 23:40 IST|Sakshi
  • నేడు మంత్రి చేతులమీదుగా ప్రశంసాపత్రాల ప్రదానం
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ శాఖల నుంచి 56 మంది ఉద్యోగులను ఉత్తమ సేవా పురస్కారాల కోసం ఎంపిక చేశారు. ఒక్కో శాఖ నుంచి ఒక ఉద్యోగిని మాత్రమే ఎంపిక చేయాలని కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశించడంతో..ఆ మేరకు జాబితాను అధికారులు రూపొందించారు. వీరికి సోమవారం ఉదయం 10:30 గంటలకు పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందించనున్నారు.

మరిన్ని వార్తలు