రోడ్డు ప్రమాదంలో 6 మందికి గాయాలు

16 Jul, 2017 22:42 IST|Sakshi

డి.హీరేహాళ్‌ (రాయదుర్గం) : మండల కేంద్రం డి.హీరేహాళ్‌లో రాష్ట్రీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. కోనాపురం గ్రామానికి చెందిన మహిళలు కూరగాయల వ్యాపార నిమిత్తం ఆటోలో బళ్లారికి వెళుతుండగా బళ్లారి నుంచి చిత్రదుర్గం వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మారెక్క, పెన్నక్క, బి. మారెక్క, చిట్టక్క, ముక్కమ్మ , హనుమక్కలు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ శేఖర్‌ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేశామని, లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని చెప్పారు.

>
మరిన్ని వార్తలు