నాకు ప్రాణ భిక్షపెట్టి ... నువ్వెళ్లిపోయావా ...

2 Sep, 2015 10:56 IST|Sakshi

ఖమ్మం: పెద్దాయనా.. పెద్దాయనా.. నువ్వులేని లోటు ఎవరు పూడ్చేరూ.. నాకు ప్రాణ భిక్షపెట్టి.. నువెళ్లిపోయావా..అయ్యా.. అంటూ ఓ అభిమాని సత్తుపల్లి మండలంలోని కొత్తూరు గ్రామంలో బుధవారం ఉదయం నుంచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి వర్ధంతి సందర్భంగా గౌరిగూడెం గ్రామానికి చెందిన 68 ఏళ్ల రేగళ్ల ముత్యాలు సమీపంలోని కొత్తూరులో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద మనస్సులోని బాధను కనీళ్లు పెట్టుకుంటూ... విగ్రహాన్ని శుభ్రం చేశాడు.

రేగళ్ల ముత్యాలుకు వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంతో ఆరు సంవత్సరాల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు. నాలాంటి ఎంతో మంది పేదోళ్ల ప్రాణాలు నిలిపి... భౌతికంగా మమ్మల్ని వదిలి వెళ్లినా.. మా మనస్సుల్లో ఎల్లప్పుడు చిరస్థాయిగా ఉంటారని ముత్యాలు తెలిపారు.

మరిన్ని వార్తలు