డెంగీతో చిన్నారి మృతి

24 Sep, 2016 09:16 IST|Sakshi

సూర్యాపేట(నల్లగొండ): డెంగీ భారీన పడి చిన్నారి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శనివారం వెలుగుచూసింది. పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన శ్రావణి(7) వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది.
 

మరిన్ని వార్తలు