యోగా కోర్సులో 70 మందికి ప్రవేశాలు

20 Aug, 2016 23:08 IST|Sakshi
యోగా ప్రవేశాల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న మిర్యాల చంద్రయ్య
ఎచ్చెర్ల: బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో యోగా కోర్సులో చేరేందుకు గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్‌ జరిపారు. 53 మందికి ఏడాది యోగా పీజీ డిప్లమా, 17 మందికి ఆరు నెలల యోగా సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు. ప్రవేశ పత్రాలను ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ మిర్యాల చంద్రయ్య అందజేశారు. యోగాకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉందని వీసీ చెప్పారు. కౌన్సెలింగ్‌లో యోగా కోర్సు కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ తారక రామారావు, ప్రిన్సిపాల్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు