అనంతపురం టౌన్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ – వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో ఈనెల 8న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు పీడీ వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు చెందిన యూనివర్సల్ స్టాఫింగ్ సొల్యూషన్స్ కంపెనీలో పని చేయడానికి ఆసక్తి ఉన్న వారు అనంతపురం శివారులోని టీటీడీసీలో జరిగే మేళాకు హాజరుకావాలన్నారు. 18–35 ఏళ్ల మధ్య ఉండి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో విద్యార్హత ఉండాలన్నారు.