వాహనం ఢీకొని బాలుడి మృతి

17 Oct, 2016 16:22 IST|Sakshi

అల్లాదుర్గం (మెదక్ జిల్లా):  అల్లాదుర్గం మండలం రాంపూర్ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి వచ్చిన బాలుడిని తూఫాన్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు పెద్దశంకరంపేటకు చెందిన నగేష్(9)గా గుర్తించారు.

పండుగ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వచ్చిన నగేష్ మార్గమధ్యంలో ఉన్న గుడికి వెళ్లాడు. దైవదర్శనానికి వెళ్లిన తల్లిదండ్రులను వదిలి ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో పెద్దశంకరంపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోన్న తూఫాన్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

>
మరిన్ని వార్తలు