96.2 శాతం ‘పల్స్‌ పోలియో’

29 Jan, 2017 23:51 IST|Sakshi

అనంతపురం : జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో విజయవంతంగా సాగినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. 0–5 ఏళ్లలోపు చిన్నారులు 4,50,545 మందికి పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 3617 పోలియో బూత్‌లలో మొదటి రోజు 4,33,321 (96.2 శాతం) మంది పిల్లలకు చుక్కలు వేశామన్నారు. ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేసే కార్యక్రమాన్ని సోమ, మంగళవారాల్లో నిర్వహిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు