కామాంధులకు 20 ఏళ్ల కారాగారం

11 Apr, 2016 15:34 IST|Sakshi

ఓ మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులకు 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ చిత్తూరు ఎనిమిదవ అదనపు న్యాయస్థానం జడ్జి చిదానందం సోమవారం తీర్పు చెప్పారు. 2013లో చిత్తూరు జిల్లాలోని పెనుమూరు ప్రాంతంలో ఓ మహిళను తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన సంపత్, కాశి బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నేరారోపణలు రుజువు కావడంతో శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

 

మరిన్ని వార్తలు