రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మృతి

12 Sep, 2016 17:10 IST|Sakshi

చిత్తూరు జిల్లా గుడిపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్(72) మృతిచెందారు. కారులో చిత్తూరు నుంచి చెన్నై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆయన 1989 నుంచి 1994 వరకూ చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు